ఏడేళ్ల బాలుడిపై కుక్కల దాడి

by Disha Web Desk 12 |
ఏడేళ్ల బాలుడిపై కుక్కల దాడి
X

దిశ తెలంగాణ, క్రైమ్ బ్యూరో: అంబర్‌పేటలో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోయాయి. కిరాణా షాప్ కు వెళ్లిన ఏడేళ్ల బాలునిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. ప్రేమ్ నగర్ నివాసి మణికంఠ కొడుకు సాయి (7) సోమవారం రాత్రి పాలు కొనడానికి స్థానికంగా ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లాడు. పాలు కొని ఇంటికి వస్తుండగా మూడు కుక్కలు దాడి చేశాయి. దీంతో ఆ బాలునికి నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు కుక్కలను తరిమి కొట్టటంతో ప్రమాదం తప్పింది. గాయాలైన బాలున్ని ఆస్పత్రిలో చేర్పించారు.



Next Story

Most Viewed