ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి

by Ajay Maddhiboyina |

ఛ‌త్తీ‌స్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది మరణించారు. రాయ్ పూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ఛత్తీస్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..13 మంది మృతి
X

దిశ‌, వెబ్ డెస్క్: ఛ‌త్తీ‌స్‌గడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఏకంగా 13 మంది మరణించారు. రాయ్ పూర్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్‌పూర్ బులోడా బజార్ రోడ్డులో సారగావ్ సమీపంలో ట్రాలీ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీకొట్టింది. అతివేగంతో వచ్చి ట్రక్కు ఢీ కొట్టడంతో ట్రాలీలో ఉన్నవారంతా చెల్లా చెదురుగా పడిపోయారు. మొత్తం 25 మంది ట్రాలీలో ఉండగా వారిలో 13మంది మృతి చెందారు. మ‌రో 12 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ‌వారిని పోలీసులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు రావాల్సి ఉంది.

Next Story