అక్రమ పశువుల రవాణా గ్యాంగ్‌ పై పోలీసుల కాల్పులు

by Malleboina Mahesh |   (  Updated:2025-10-29 04:31:26  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న గ్యాంగ్‌కు చెక్ పెట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు.

అక్రమ పశువుల రవాణా గ్యాంగ్‌ పై పోలీసుల కాల్పులు
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో పోలీసులు నిర్వహించిన ఎన్‌కౌంటర్ (Encounter) ఆపరేషన్‌లో అక్రమంగా పశువులను రవాణా చేస్తున్న గ్యాంగ్‌కు చెక్ పెట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అరెస్టయ్యారు. వీరిలో ఇద్దరు కాల్పుల్లో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మైన్‌పురి రూరల్ ఎస్పీ రాహుల్ మిథాస్ వెల్లడించిన వివరాల ప్రకారం..“సాధారణ గస్తీ సమయంలో, ఫజిల్‌పూర్ అడవుల్లో అక్రమ పశు రవాణా జరుగుతుందని సమాచారం అందడంతో, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే పోలీసులను గమనించిన నిందితులు.. వారి వద్ద ఉన్న తుపాకులతో కాల్పులు జరిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురు కాల్పులు జరిపారు.

ఈ ఎన్ కౌంటర్‌లో బాబు, శంకర్ అనే ఇద్దరు గాయపడగా, అజయ్, ముఖేష్ అనే మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఒక పిస్టల్, గుళికలు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, వీరు రాజస్థాన్‌లోని కోటా, బుండి ప్రాంతాలకు చెందినవారని, పశువుల వధ, అక్రమ రవాణా కేసుల్లో మునుపటి రికార్డులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అదే సమయంలో గణనీయమైన సంఖ్యలో పశువులను సురక్షితంగా రక్షించినట్లు ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం మిగిలిన అనుమానితుల కోసం గాలింపు కొనసాగుతోందని, రక్షించబడిన పశువుల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Next Story