₹4.56 కోట్ల విలువైన డ్రగ్స్ కాల్చి బూడిద చేసిన పోలీసులు

by Muthe.Rajitha |

వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువైన డ్రగ్స్ ను కాల్చి బూడిద చేసారు హైదరాబాద్ పోలీసులు.

₹4.56 కోట్ల విలువైన డ్రగ్స్ కాల్చి బూడిద చేసిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్ : వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న కోట్ల విలువైన డ్రగ్స్ ను కాల్చి బూడిద చేసారు హైదరాబాద్ పోలీసులు. ఈమేరకు హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ మాదకద్రవ్యాలను కాల్చివేస్తున్న ఒక వీడియోను తన సోషల్ మీడియా ఖాతా 'X' లో పోస్ట్ చేసారు. ఇటీవల కాలంలో 128 నార్కోటిక్ డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో పట్టుకున్న దాదాపు రూ.4.56 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను ఇన్సినరేటర్స్ లో వేసి ధ్వంసం చేశారు. నగరంలోని 26 పోలీస్ స్టేషన్ల నుండి గంజాయి, MDMA, LSD, కొకైన్, ఇతర మాదకద్రవ్యాలను వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకోగా.. వాటిని నేడు తగలబెట్టారు పోలీసులు.

Next Story