- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
by Disha Web Desk 1 |
X
దిశ, జమ్మికుంట : పిడుగుపాటుకు గురై ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని నాగంపేట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామంచ కొమరయ్య (47) పదేళ్ల క్రితం బతుకుతెరువు కోసం నాగంపేట గ్రామానికి వచ్చి జీవనం సాగిస్తున్నాడు. ఓ పాత ఇనుప సామాను దుకాణంలో దినసరి కూలీగా పనిచేస్తున్న కొమురయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు గురవడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య భాగ్యలక్ష్మి, కుమారుడు నరేందర్, కూతుళ్లు మౌనిక, స్పందన ఉన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన కొమురయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ చిన్నికృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
Next Story