అర్కగూడ ప్రాజెక్టులో పడి ఒకరి మృతి..

by Disha Web Desk 20 |
అర్కగూడ ప్రాజెక్టులో పడి ఒకరి మృతి..
X

దిశ, చింతలమానేపల్లి : మండలంలోని బాబాసాగర్ గ్రామ సమీపంలోని అర్కగూడ ప్రాజెక్ట్ లో పడి ఒకరు మృతి. ఎస్సై విజయ్ తెలిపిన వివరాల ప్రకారం బాబాసాగర్ గ్రామానికి చెందిన జానీ మహమ్మద్ వయస్సు (48) అనే వ్యక్తి గ్రామంలోని పలువురి గేదెల కాపరిగా పనిచేస్తున్నాడు. అదే క్రమంలో బుధవారం గ్రామ సమీపంలోని ఆర్కగూడ ప్రాజెక్టు వద్ద గేదెలను మేపుతూ ప్రాజెక్టులో నుంచి అవతలి వైపుకు గేదెలతో పాటు అతను మద్యం మత్తులో ఈత కొడుతూ వెళ్ళాడు.

తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికిన ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్కగూడ ప్రాజెక్టు సమీప ప్రాంతాల్లో జానీ మహమ్మద్ గొడుగు టిఫిన్ బాక్స్ ఆనవాలు కనిపించడంతో, నాటుపడాల ద్వారా గజతాగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టడంతో మృతదేహం లభించింది. మృతుడి కుమారుడైన సాహిర్ పాషా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ తెలిపారు.


Next Story