మహిళాల్యాబ్ టెక్నీషియన్ అదృశ్యం..

by Disha Web Desk 11 |
మహిళాల్యాబ్ టెక్నీషియన్ అదృశ్యం..
X

దిశ, మేడిపల్లి: మహిళా ల్యాబ్ టెక్నీషియన్ అదృశ్యమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నర్సింగ్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్ కర్నూల్ జిల్లా పరిధి మరికల్ కు చెందిన కృష్ణవేణి(22), మేడిపల్లి మండల పరిధి బుద్ధనగర్ లో శ్రీనిధి హాస్టల్ లో ఉంటూ ఓ ప్రైవేట్ ల్యాబ్ లో పనిచేస్తోంది. ఈ నెల 5వ తేదీన తన గ్రామానికి వెళ్తున్నానని చెప్పి ఆమె హాస్టల్ నుంచి బయలుదేరి వెళ్లింది.

కానీ ఆమె ఇంటికి చేరకపోవడంతో తన కుమార్తె కోసం వెంకటయ్య తెలిసిన ప్రదేశాల్లో వెతికినా ఎక్కడ ఆచూకీ లభించకపోవడంతో మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆచూకీ తెలిసినవారు డయల్ 100 కు గాని, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ గాని సమాచారం ఇవ్వాలని మేడిపల్లి ఎస్ఐ నరసింహ రావు తెలిపారు.



Next Story

Most Viewed