చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

by Batti.Sumithra |

చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలోని అందుగులపల్లిలో బుధవారం జరిగింది.

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి
X

దిశ, వెల్దుర్తి : చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలోని అందుగులపల్లిలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అందుగులపల్లి గ్రామానికి చెందిన గోపాల్(40) పెద్ద చెరువులో మంగళవారం చేపల వేటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీశారు.


Next Story