రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..

by Disha Web Desk 11 |
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం..
X

దిశ, మేడిపల్లి: లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పల్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న నాంపల్లి సాయి కుమార్ (25) ద్విచక్ర వాహనంపై నారపల్లి నుంచి ఉప్పల్ వెళుతున్న క్రమంలో పీర్జాదిగూడ కమాన్ వద్దకు చేరుకోగానే లారీ సాయి కుమార్ వెళ్తున్న వాహనాన్ని వెనుక వైపు నుంచి ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయాడు. దీంతో సాయికుమార్ తలపై నుంచి లారీ దూసుకెళ్లడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed