మలక్‌పేట్ కాల్పుల కేసు.. మరో ఐదుగురు నిందితుల గుర్తింపు

by Kema Shiva Kumar |

మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే.

మలక్‌పేట్ కాల్పుల కేసు.. మరో ఐదుగురు నిందితుల గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: మలక్‌పేట (Malakpet)లో కాల్పుల ఘటన కలకలం సృష్టించిన విషయం విదితమే. శాలివాహన‌నగర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ వెళ్లిన సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్‌ (43)పై గుర్తు తెలియని దండుగులు ఆరు రౌండ్ల పాటు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దీంతో అతడు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి ప్రాణాలో కోల్పోయాడు. అనంతరం కారులో వచ్చిన దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ నేపథ్యంలోనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పటికే ఘాతుకానికి పాల్పడిన మొత్తం 9 మందిని గుర్తించి అందులో నలుగురిని అరెస్ట్ చేశారు. హత్యకు సహకరించి పరారీలో ఉన్న మరో ఐదుగురి ఆచూకీ కోసం 10 బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. కుంట్లూరు (Kuntloor)లో రాజేష్ (Rajesh) అనే వ్యక్తితో భూతగాదాలే హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు వివాహేతర సంబంధం కోణంలోనూ ఆరా తీస్తున్నారు. చందు నాయక్‌పై కాల్పులు జరిపాక నిందితులు చౌటుప్పల్ వైపు వెళ్లినట్లుగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించి నిర్ధారించారు.

Next Story