ఆ పార్టీ నేతల కారణంగా జర్నలిస్ట్ ఆత్మహత్య

by Disha Web Desk 12 |
ఆ పార్టీ నేతల కారణంగా జర్నలిస్ట్ ఆత్మహత్య
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: వృత్తిలో కొందరు అడ్డు తగులుతున్నారని ఓ జర్నలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. జిల్లాలోని రామగిరి మండల విలేకరిగా శ్రీకాంత్ ఓ తెలుగు పత్రికలో పని చేస్తున్నాడు. కాగా, పెద్దపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద శ్రీకాంత్ రైలు కిందపడి ప్రాణం తీసుకున్నాడు. అంతకుముందు రామగిరి ఎస్సై కి వాట్సాప్ మెసేజ్ పెట్టిన శ్రీకాంత్ అందులో కాంగ్రెస్ ఎంపీటీసీ కొప్పుల గణపతి, స్థానిక రిపోర్టర్లు చిందం రమేష్, పొన్నం శ్రీనివాస్ తన వృత్తికి అడ్డు తగులుతున్నారని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed