- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భార్య మొహం పై యాసిడ్ తో దాడి చేసిన భర్త..
by Batti.Sumithra |
కట్టుకున్న భర్తే భార్య మొహం పై బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్ తో దాడి చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది.

X
దిశ, జూబ్లిహిల్స్ : కట్టుకున్న భర్తే భార్య మొహం పై బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్ తో దాడి చేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. పూర్తివివరాల్లోకెళితే రహమత్ నగర్ కి చెందిన మహమూద్ అలీ కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య అప్సర బేగం మొఖం పై బాత్రూమ్ శుభ్రం చేసే యాసిడ్ తో దాడికి పాల్పడ్డాడు.
ఆమె అరుపులు గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న మధురానగర్ పోలీసులు వైద్యం నిమిత్తం అప్సర ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనంతరం నిందితుడు మహమూద్ అలీని అదుపులోకి తీసుకుని, కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.
Next Story






