Crime News తాగుడుకు బానిసై ఓ వ్యక్తి.. అర్ధరాత్రి ఏం చేశాడో తెలుసా

by Disha Web Desk 12 |
Crime News  తాగుడుకు బానిసై ఓ వ్యక్తి.. అర్ధరాత్రి ఏం చేశాడో తెలుసా
X

దిశ, భిక్కనూరు: తాగుడుకు బానిసై, అందు కోసం చేసిన అప్పులు తీర్చలేక, మనస్థాపానికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన గురువారం భిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కంచర్ల గ్రామంలో కర్రోళ్ళ స్వామి (44) కూలి నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తాగుడుకు బానిసైన స్వామి, తాను పని చేస్తే వచ్చే డబ్బులను తీసుకెళ్లి తాగుడుకు ఖర్చు చేసేవాడు. కుటుంబ సభ్యులు తాగుడు మానేయాలని చెప్పినా వినిపించుకోకుండా, కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ మత్తులో జోగే వాడు. తాగుడుకు చేసిన అప్పులు పెరిగిపోవడం, చేసిన అప్పులు తీర్చే దారి లేక మానసికంగా కృంగి పోయేవాడు. బుధవారం రాత్రి పది గంటల ప్రాంతంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన స్వామి, అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఇంటికి చేరుకున్నాడు.

పక్క గదిలో పడుకుంటానని చెప్పిన స్వామి గురువారం ఉదయం వరకు కూడా, తాను పడుకున్న గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు కొట్టారు. అయినప్పటికీ గదిలోనుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపులను బాది లోనికి వెళ్లి చూడగా అప్పటికే స్వామి దూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్నాడన్న అనుమానంతో కుటుంబ సభ్యులు ఉరిని తొలగించి కింద పడుకోబెట్టి బెట్టారు. అప్పటికే స్వామి మృతిచెందాడని నిర్ధారణకు రావడం, అప్పటికే ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడం, వారి సహకారంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు భిక్కనూరు ఎస్ఐ ఆనంద్ గౌడ్ నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, భార్య చంద్రకళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు శ్రవణ్, కుమార్తె సాదిని ఉన్నారు.


Next Story

Most Viewed