ట్రక్కును కారు ఢీకొని నలుగురు మృతి.. 8 మందికి గాయాలు

by Disha Web Desk 12 |
ట్రక్కును కారు ఢీకొని నలుగురు మృతి.. 8 మందికి గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజస్థాన్ ఘోర రోడ్డు ప్రమాదం జరిగి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్లోని చిత్తోర్ గఢ్ లో సమీపంలో బంధువు అంత్యక్రియలకు వెళ్లి ఇండోర్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో వాహనం వేగంగా వచ్చి ఓ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో 8 మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. స్థానికుల నుంచి సమాచారం అందడంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం మంగళవాడ్ నుంచి ఉదయ్‌పూర్‌కు తరలించామని పోలీసు అదికారి తెలిపారు.

Next Story