కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-05 04:44:14  IST  )

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన ఇవాళ కర్ణాటక రాష్ట్ర పరిధిలో చోటుచేసుకుంది.

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ముగ్గురు తెలంగాణవాసులు దుర్మరణం పాలైన విషాద ఘటన ఇవాళ ఉదయం కర్ణాటక (Karnataka) రాష్ట్ర పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి (Sangareddy) జిల్లా నారాయణఖేడ్ మండల పరిధిలోని జగన్నాథ్‌పూర్ (Jagannadhpur) గ్రామానికి చెందిన వారు కారులో గణగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలోనే బీదర్ జిల్లా హల్లిఖేడ్ (Hallikhade) వద్ద వారి కారును ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో స్పాట్‌లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Next Story