గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి

by Disha Web Desk 20 |
గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి
X

దిశ, భిక్కనూరు: గుండెపోటుతో ఉపాధి హామీ కూలీ మృతి చెందిన సంఘటన భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన నర్సింలు (48) కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధి హామీ పనులకు వెళ్లాడు. పనులు ప్రారంభించిన కొద్దిసేపటికే నర్సింలు ఒక్కసారిగా కుప్పకూలాడు.

వెంటనే కుటుంబ సభ్యులు కింద పడిపోయిన నర్సింలుకు సీపీఆర్( కార్డియో పల్మనరీ రిసస్ స్టేషన్ ) చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో సచివాలయ కార్యదర్శి లక్ష్మి, ఎంపీఓ ప్రవీణ్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అంబులెన్స్ లో ఎక్కించి కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి మార్గమధ్యంలో మృతి చెందాడని, గుండెపోటు రావడం వల్లే నర్సింలు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. నర్సింలు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.



Next Story

Most Viewed