- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగిఉన్న బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు ఢీకొనడంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.

X
దిశ, వెబ్డెస్క్: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే దుర్మరణం పాలైన విషాద ఘటన చిత్తూరు (Chittoor) జిల్లా బంగారుపాళ్యం మండల పరిధిలో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు తిరుపతి - బెంగళూరు జాతీయ రహదారిపై శేషాపురం వద్ద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి కారు అతివేగంతో అదుపుతప్పి బలంగా ఢీకొంది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు వరంగల్ (Warangal) జిల్లాకు చెందిన శ్రీధర్ రావు, లక్ష్మీ, అద్వికగా గుర్తించారు. బెంగళూరు నుంచి తిరుమలకు కారులో వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Next Story






