మరో ఘోర ప్రమాదం.. బస్సులో 42 మంది ప్రయాణికులు.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-12-01 15:30:58  IST  )

మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ కోచ్ బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాజస్థాన్ కోటా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది.

మరో ఘోర ప్రమాదం.. బస్సులో 42 మంది ప్రయాణికులు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై స్లీపర్ కోచ్ బస్సును గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ఘటనలో ఇద్దరు బస్సు డ్రైవర్లు మృతి చెందగా.. ఎనిమిది ప్రయాణికులకు గాయాలయ్యాయి. రాజస్థాన్ కోటా జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. ఢిల్లీ నుంచి ఇండోర్‌కు వెళ్తున్నబస్సు.. కైథూన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరంఖేడా గ్రామం సమీపంలో గుర్తు తెలియని వాహనంతో ఢీకొంది. ఈ ధాటికి బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు కాగా ఇద్దరు డ్రైవర్లు మరణించారు. ఈ సమయంలో బస్సులో 42 మంది ప్రయాణికులు ఉండగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోటా న్యూ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అతివేగం, మంచు ప్రమాదానికి కారణమై ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story