- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో దారుణం.. మద్యం తాగించి బీటెక్ స్టూడెంట్పై అత్యాచారం
హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాాచారానికి పాల్పడ్డ ఘటన నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. బీటెక్ విద్యార్థినిపై తోటి విద్యార్థి అత్యాాచారానికి పాల్పడ్డ ఘటన నగరంలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఉదయ్ అనే విద్యార్థి తన స్నేహితురాలిని ఈ నెల 14న రాత్రి సమయంలో దిల్సుఖ్నగర్కు తీసుకువచ్చాడు. ఓ హోటల్లో టీ తాగిన తరవాత తిరిగి ఇద్దరూ కారులో ఇబ్రహీంపట్నం బయలుదేరారు. మార్గమధ్యలో మద్యం తీసుకున్న ఉదయ్ యువతిని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెకు సైతం మద్యం తాగించాడు. యువతి మద్యం మత్తులోకి జారుకోవడంతో ఇబ్రహీంపట్నంలోని ఓ గదికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. స్నేహితుడే అని నమ్మివెళితే అత్యాచారం చేయడంతో యువతి ఈ నెల 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.






