ఆటో కారు ఢీ.. వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

ఆటో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంషుద్దీన్ పూర్ గ్రామ శివార్లో చోటు చేసుకుంది.

ఆటో కారు ఢీ.. వ్య‌క్తి మృతి
X

దిశ, రాయికోడ్ : ఆటో కారు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శంషుద్దీన్ పూర్ గ్రామ శివార్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్ర పరిధిలోని శంషాద్దీన్ పూర్ గ్రామ శివారులోని మెయిన్ రోడ్డు వైపుగా ఎదురెదురుగా TS 07GP 5949, నంబర్ గల కారు ఆటో ప్రయాణిస్తూ ఢీ కొన్నాయి. ఆటో డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందగా.. కార్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన వ్యక్తి మండల కేంద్ర పరిధిలోని కుస్నూరు గ్రామానికి చెందిన మల్లారెడ్డి (32) గుర్తించారు. అనంతరం మృతి దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొరకు జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Next Story