ఏడుపాయల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..

by Disha Web Desk 20 |
ఏడుపాయల్లో గుర్తుతెలియని మృతదేహం లభ్యం..
X

దిశ, పాపన్నపేట : మండల పరిధిలోని ఏడుపాయల ఆలయ సమీపంలోని చెక్ డ్యామ్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం శనివారం లభ్యమైనట్లు ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం చెక్ డ్యామ్ లో సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతదేహం లభమైంది. మృతదేహం పై పసుపురంగు టీషర్ట్ పై నలుపు, తెలుపు గీతలు ఉన్నాయని తెలిపారు.

దీంతో పాటు నల్లటి డ్రాయర్ ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఆనవాలను బట్టి ఎగువ ప్రాంతంలో నుండి కొట్టుకు వచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. మూడు నుండి ఐదు రోజుల క్రితం మరణించి ఉంటారని ప్రాథమిక అంచనా వేసినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై విజయకుమార్ తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే తనను సంప్రదించాలని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed