పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య

by Dishafeatures2 |
పురుగుల మందు తాగి యువకుడి ఆత్మహత్య
X

దిశ, ఏటూరునాగారం: జీవితం మీద విరక్తి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. సెకండ్‌ ఎస్సై ఇంద్రయ్య కథనం ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన కొలిపాక రాజు(25) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వివ‌రాల్లోకి వెళితే రామ‌న్న‌గూడెంకు చెందిన‌ కొలిపాక వెంకటనర్సయ్య, సుగుణ దంపతులకు ఇద్దరు సంతానం కాగా కుమార్తెకు వివాహం జరగింది. కుమారుడు రాజు 10 ఎకరాల పంటను సాగు చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఉన్నప్పటికీ వ్యవసాయ పనులు రాజు చూసుకునేవాడు.

పంటకు మొగిపురుగు సోకడంతో పంట దిగుబడి రాదని మనస్థాపానికి గురై సోమవారం తాను సాగు చేస్తున్న పొలం వద్ద పురుగు మందు తాగి పడిపోయాడు. ఇది గమనించిన స్థానికులు ఏటూరునాగారం సామాజిక ప్రభుత్వ‌ ఆస్పత్రికి తరలించగా అప్ప‌డికే రాజు ప‌రిస్థితి విష‌మించ‌డంతో వరంగల్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. రాజుకు చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి సర్జరీ అయ్యింది. ఇదే క్రమంలో అంగవైకల్యం కలిగి ఉండడంతో వివాహం కావడం లేదని, పెళ్లి చూపులకు వచ్చి తిరిగిపోతున్నారని కూడా రాజు తరుచూ బాధపడేవాడు. ఇటు పొలం నష్టపోయిందని, అటు తనకు వివాహం జరగడం లేదని విరక్తి చెందిన రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్సై తెలిపారు.



Next Story

Most Viewed