రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

by Ratna Kumari |

దిశ, జమ్మికుంట టౌన్ : రైలు కింద ప‌డి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జ‌మ్మికుంట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుప‌తి తెలిపిన

రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
X

దిశ, జమ్మికుంట టౌన్ : రైలు కింద ప‌డి యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న సంఘ‌ట‌న జ‌మ్మికుంట మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుప‌తి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. జ‌మ్మికుంట మండ‌ల ప‌రిధిలోని త‌నుగుల గ్రామానికి చెందిన ర‌జినీకాంత్ (31) కూలి ప‌ని చేస్తూ జీవ‌నం సాగించేవాడు. సుమారు ఒక సంవ‌త్స‌రం నుంచి అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నాడు. దీంతో మ‌న‌స్థాపానికి గురై బిజిగిరి-పోత్క‌ప‌ల్లి రైల్వే స్టేష‌న్ల మ‌ధ్య త‌నుగుల గ్రామ స‌మీపంలో ఎగువ రైలు ప‌ట్టాల మ‌ధ్య రైలు కింద ప‌డి ఆత్మ హ‌త్య చేసుకున్నాడు. కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు రైల్వే హెడ్ కానిస్టేబుల్ తిరుప‌తి తెలిపారు.

Next Story