మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య

by Disha Web Desk 1 |
మద్యం తాగేందుకు డబ్బు ఇవ్వలేదని యువకుడి ఆత్మహత్య
X

దిశ, వెల్దుర్తి : మద్యం తాగేందుకు తన తల్లి డబ్బులివ్వలేదని మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాసాయిపేట మండలం పోతన్ పల్లి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దేవనోళ్ల నర్సింహులు (28) తన తల్లిని మద్యం తాగేందుకు రూ.వెయ్యి ఇవ్వాలని అడిగాడు. డబ్బులివ్వక పోగా.. తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన నర్సింహులు ఆదివారం మధ్యాహ్నం పురుగుల మందు తాగాడు. గమనించిన స్థానికులు అతడిని మెరుగైన చికిత్స హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై ప్రకాష్ గౌడ్ వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.


Next Story