ఆన్లైన్ గేమింగ్ తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య

by Ratna Kumari |

దిశ, కామారెడ్డి : ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది.

ఆన్లైన్ గేమింగ్ తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి : ఆన్​లైన్​ గేమ్స్​కు అలవాటు పడిన ఓ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ సిఐ నరహరి తో పాటు కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి గోదావరికి శ్రీనాథ్, శ్రీకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనాథ్​కు వివాహం అయింది. శ్రీకర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే శ్రీకర్​ ఏడాదిన్నర కాలంగా ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుతున్నాడు. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు చేశాడు. అయితే అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక ఉన్న ఇల్లు అమ్ముకుని కొన్ని అప్పులు తీర్చాడు. మిగతావి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కాగా గురువారం తల్లి గోదావరి కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్​కు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీకర్ బెడ్​రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Next Story