ఫామ్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న మహిళ దారుణ హత్య..

by Disha Web Desk 19 |
ఫామ్ హౌస్‌లో ఒంటరిగా ఉన్న మహిళ దారుణ హత్య..
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓ ఫామ్ హౌస్‌లో మహిళ దారుణ హత్యకు గురయ్యింది. కలకలం సృష్టించిన ఈ దారుణం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దాసర్లపల్లిలో జరిగింది. నెల్లూరుకు చెందిన నరేందర్ రెడ్డి, శైలజ రెడ్డిలు భార్యాభర్తలు. దాసర్లపల్లిలోని ఓ ఫామ్ హౌస్‌లో కాపలా పని చేస్తూ అక్కడే ఉంటున్నారు. శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో శైలజ ఇంట్లో ఒంటరిగా ఉండగా దుండగులు కత్తితో పొడిచి చంపారు. ఈ ఘాతుకానికి ఒడిగట్టింది ఎవరన్నది తెలియరాలేదు.

Next Story