తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య..

by Disha Web Desk 20 |
తల్లి మందలించిందని విద్యార్థి ఆత్మహత్య..
X

దిశ, బెజ్జుర్ : బోనాల పండుగకు పోవద్దని తల్లి మందలించడంతో ఓ విద్యార్థి పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని రెబ్బెన గ్రామంలో మంగళవారం జరిగింది. బెజ్జూర్ ఎస్సై వెంకటేష్ కథనం ప్రకారం బెజ్జూర్ మండలం రెబ్బెన గ్రామానికి చెందిన నాయిని రవితేజ (15) పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. రెబ్బెన గ్రామానికి చెందిన నాయిని బాయక్క, నాయిని రంగయ్యల కుమారుడు నాయిని రవితేజను బోనాల పండుగకు వెళ్లొద్దని తల్లి నాయని బాయక్క మందలించి, భర్త రంగయ్యతో కలిసి ఉపాధి కూలిపనులకు వెళ్ళింది.

కూలీ పనులు ముగించుకొని వచ్చేసరికి, కుమారుడు పురుగుల మందు సేవించి, అపస్మారక స్థితిలో ఉండడంతో ఆటోలో కాగజ్నగర్ ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా, రవితేజ మృతి చెందినట్లు మృతుని తండ్రి రంగయ్య బెజ్జూరు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. కాగా మృతుడు ఆదిలాబాద్ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed