గొర్రెల మంద‌పైకి దూసుకెళ్లిన లారీ.. 30 జీవాల మృతి

by Disha Web Desk 4 |
గొర్రెల మంద‌పైకి దూసుకెళ్లిన లారీ.. 30 జీవాల మృతి
X

దిశ, మక్తల్: రోడ్డు దాటుతున్న గొర్రెల మందపై లారీ దూసుకెళ్ళడంతో 30 గొర్రెలు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో పది గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటన కృష్ణ చెక్ పోస్ట్ దగ్గర మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గొర్రెల పై నుంచి లారీ వెళ్లిన ప్రదేశంలో మాంసముద్దలతో భయానక వాతావరణం నెలకొంది. దాదాపు రూ. 3 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని కుర్వ లింగప్ప ఆవేదనతో తెలిపాడు.

హైదరాబాద్ నుండి రాయచూర్‌కి లోడుతో వెళ్తున్న లారీ కృష్ణ చెక్ పోస్ట్ దగ్గర తెల్లవారుజామున ఎదురుగా వచ్చే లారీ లైట్ల ఫోకస్‌తో ఒక్క సారిగా కళ్ళు బైర్లు కమ్మడంతో ముందున్న గొర్రెల మంద కనిపించలేదు. దీంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. మక్తల్ పట్టడానికి చెందిన కురువ లింగప్ప నది పరివాక ప్రాంతంలో గొర్రెలు మేపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు.

రోజు లాగే మంగళవారం తెల్లవారుజామున కృష్ణ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డు దాటుతున్న సమయంలో మందపై లారీ దూసుకెళ్ళింది. గొర్రెల పెంపకం తన జీవనాధారం అని దీనిపైనే ఆధారపడి ఉన్నందున నష్ట పోయిన తమను ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదుకోవాలని కుర్వలింగప్ప కోరారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై విజయ భాస్కర్ తెలిపారు.


Next Story

Most Viewed