చేవెళ్లలో కారు బీభత్సం.. 20 బైక్‌లు ధ్వంసం!

by Disha Web Desk 19 |
చేవెళ్లలో కారు బీభత్సం.. 20 బైక్‌లు ధ్వంసం!
X

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో ఓ కారు భీభత్సం సృష్టించింది. గురువారం మల్కాపూర్ నుండి చేవేళ్లకు వస్తుండగా కారు అదుపుతప్పి ఒక్కసారిగా బైకులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 20 బైక్‌లు, 2 కార్లు ధ్వంసమైనట్లు సమాచారం. కారు అదుపు తప్పి భీభత్సం సృష్టించడంతో భయాందోళనకు గురైన బైకర్స్ వాహనాలు వదిలి పరుగులు పెట్టారు. అయితే, కారు నడుపుతోన్న వ్యక్తికి ఫిట్స్ రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీ కొనడంతో బైక్‌లు తీవ్రంగా దెబ్బ తినడంతో పరిహారం ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story