- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
54 కేజీల గంజాయి స్వాధీనం
by Sridhar Babu |
గంజాయి సరఫరా చేస్తున్న ముఠా నుంచి 54 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు.

X
దిశ,చౌటుప్పల్ : గంజాయి సరఫరా చేస్తున్న ముఠా నుంచి 54 కేజీల గంజాయిని ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద మంగళవారం ఉదయం ఎస్వోటీ పోలీసులు వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు కారులో గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు.
మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ ద్యానేశ్వర్ యాదవ్(24), నవనాథ్ భబన్ మోహితే(34), ధర్మ అస్రోబా తువార్(50) తమ కారులో గంజాయిని ఇతరులకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు తనిఖీలలో గుర్తించారు. ఈ సందర్భంగా వీరి నుంచి 54 కేజీల గంజాయి, 4 సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపారు.
- Tags
- ganja seized
Next Story






