ఐపీఎల్‌తో జట్టు కట్టిన క్రెడ్

by  |
ఐపీఎల్‌తో జట్టు కట్టిన క్రెడ్
X

దిశ, స్పోర్ట్స్: యూఏఈ(UAE)లో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)తో క్రెడిట్ కార్డ్ పేమెంట్ కంపెనీ ‘క్రెడ్'(CRED) జట్టు కట్టింది. ఐపీఎల్ 2020కి అధికార భాగస్వామిగా క్రెడ్ ఎంపికయినట్లు బీసీసీఐ(BCCI) ప్రకటించింది. గతంతో అధికార భాగస్వామిగా ఉన్న ‘డ్రీమ్ 11′(‘Dream 11) టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుండటంతో దాని స్థానంలో క్రెడ్‌ను తీసుకున్నారు. ఈ సీజన్‌కు గాను టాటా మోటార్స్(Tata Motors), అన్ అకాడెమీతో కలసి క్రెడ్ కూడా అధికార భాగస్వామిగా వ్యవహరించనుంది. ఈ మూడు సంస్థలు కలిపి ప్రస్తుత ఏడాది రూ.120 కోట్లు బీసీసీఐకి చెల్లించనున్నట్లు ఒక అధికారి వెల్లడించారు.

Next Story

Most Viewed