‘ఎస్ఈసీ, ప్రభుత్వం గొడవ పడటం సిగ్గుచేటు’

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి(SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు, ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శలు చేశారు. ఎస్ఈసీ, ప్రభుత్వం ఘర్షణకు సిద్ధపడటం దురదృష్టకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ ఘర్షణ వాతావరణాన్ని విడనాడాలి అని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు వ్యవస్థలు పరస్పర సహకారంతో స్థానిక ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.</p>

‘ఎస్ఈసీ, ప్రభుత్వం గొడవ పడటం సిగ్గుచేటు’
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి(SEC) నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు, ప్రభుత్వానికి మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీనిపై సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శలు చేశారు. ఎస్ఈసీ, ప్రభుత్వం ఘర్షణకు సిద్ధపడటం దురదృష్టకరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఎస్ఈసీ ఘర్షణ వాతావరణాన్ని విడనాడాలి అని సూచించారు. కోర్టు ఆదేశాల మేరకు రెండు వ్యవస్థలు పరస్పర సహకారంతో స్థానిక ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Next Story