‘తెలుగు సీఎంలకు ప్రధాని మోడీ అంటే భయం’

by  |
‘తెలుగు సీఎంలకు ప్రధాని మోడీ అంటే భయం’
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికలపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఏపీ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న ఏకగ్రీవాలపై మానవ హక్కుల కమిషన్‌తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఏపీలో జరుగుతున్నవన్నీ బలవంతపు ఏకగ్రీవాలే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ జోక్యం వల్లే పదిశాతం ఎన్నికలైనా జరిగాయని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed