స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవార్డులు

by  |
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు అవార్డులు
X

దిశ, హైదరాబాద్: లాక్‌డౌన్ కాలంలో సాయం చేసిన సంస్థలు, వ్యక్తులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. శనివారం నాగోల్‌లోని శుభం కన్వెన్షన్ సెంటర్‌లో 100 మందికి గుడ్ సమరిటన్స్ పేరిట అవార్డులను అందజేశారు. వలస కార్మికులు, అనాథలు, సీనియర్ సిటిజన్స్‌కు శానిటైజర్స్, మాస్కులు, ఆహారం, పీపీఈ కిట్లు, కిరాణ వస్తువులను అందజేసిన వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏవీ రామారావు (ఏవీఆర్ ల్యాబ్స్), నారాయణరావు (శ్రీదత్తా హ్యుమన్ సర్వీసెస్), సునీతాకృష్ణన్, ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఛైర్మన్ పద్మావతి, ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్, మల్కాజిగిరి డీసీపీ, భువనగిరి డీసీపీ, పలవురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed