మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా!

by  |
మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరోనా!
X

దిశ ప్రతినిధి, మెదక్: కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారులకు సైతం కరోనా వెంటాడుతోంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కు కరోనా అనుమానంతో హన్మకొండలోని తన ఇంటిలో హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బంధువుల్లో ఒకరికి పాజిటివ్ రావడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా ఎమ్మెల్యేకు సైతం పాజిటివ్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. పాజిటివ్ కు సంబంధించిన లక్షణాలు లేకపోయినప్పటికీ ముందస్తు జాగ్రత్తగా ఎమ్మెల్యే తన స్వగృహంలో క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిసింది. ఈ విషయంపై వైద్యాధికారుల నుంచి సమాచారం రావాల్సి ఉంది.

Next Story

Most Viewed