భక్తి పేరిట భయాన్ని గాలికొదిలేసి.. గో కరోనా అంటూ పూజలు

by  |
Corona positive
X

దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. అన్ని జిల్లా్ల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో గ్రామాలు, మండలాల వారీగా జనాలు స్వచ్చంధంగా లాక్ డౌన్ విధించుకుంటున్నారు. మరికొందరు సరిహద్దు గ్రామాలకు రాకపోకలను నిలిపివేసేందుకు కంచెలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

అయితే, నిర్మల్ జిల్లాలో కరోనా వ్యాప్తి తగ్గాలని గ్రామ దేవతలకు జాతర నిర్వహిస్తున్నారు. కుభీర్ మండలం పార్డి.కె గ్రామంలో గ్రామ దేవతల కోసం జరుపుతున్న జాతరలో కరోనా నిబంధనలను జనం పాతరేశారు. కరోనా పోవాలని పూజల పేరిట గుంపుగుంపులుగా జనం సంచరించడంతో పాటు గంగాజలంతో అభిషేకాలు చేస్తున్నారు. ఇదివరకు జిల్లాలో నమోదైన కేసులను మరించి తండోపతండాలుగా జనం తరలివస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed