కరోనా నెగెటివ్ రిపోర్ట్.. కానీ, ఆయన మృతి

by  |
కరోనా నెగెటివ్ రిపోర్ట్.. కానీ, ఆయన మృతి
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా సోకలేదన్న ఆనందం విషాదంగా మార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఏలూరు బడేటివారి వీధికి చెందిన కె.అప్పారావు (62) ప్రభుత్వం తాజాగా ఏర్పాటు చేసిన సంజీవని బస్సుల వద్ద కరోనా టెస్టింగ్ చేసుకున్నాడు. ఫలితం కోసం వేచి చూస్తుండగా… దగ్గరకొచ్చిన కొడుకు ఆనందంతో గట్టిగా నాన్నా నీకు కరోనా నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది అంటూ చెప్పాడు. దీనిని పొరపాటుగా అర్ధం చేసుకున్న అప్పారావు అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటేనే స్పందించిన వైద్య సిబ్బంది రెస్పరేటరీ సిస్టమ్ ద్వారా శ్వాస అందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. వెంటనే 108 ద్వారా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే అప్పారావు మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. దీంతో వారింట్లో విషాదం నెలకొంది.



Next Story

Most Viewed