భర్తకు భరణం ఇవ్వాలని భార్యకు ఆదేశాలు !

by  |
భర్తకు భరణం ఇవ్వాలని భార్యకు ఆదేశాలు !
X

దిశ, వెబ్‌డెస్క్: కొన్నేళ్లుగా విడిగా ఉంటోన్న దంపతుల కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని ఫ్యామిలీ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ పెన్షనర్ అయిన మహిళ.. భర్తకు ప్రతినెలా భరణం రూ.వెయ్యి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. కొన్నేళ్లుగా దంపతులు విడివిడిగా ఉంటుండగా.. హిందూ వివాహ చట్టం 1955కింద తన భార్య నుంచి భరణం ఇప్పించాలని ఓ వ్యక్తి 2013లో కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన మహిళకు నెలకు రూ.12వేలు పెన్షన్ వస్తుండగా అందులో నుంచి భర్త ఖర్చుల కోసం నెలకు రూ.1000 చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.


Download Dishadaily Android APP

Download Dishadaily IOS APP



Next Story

Most Viewed