ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ..

by  |
ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమ..
X

దిశ, సికింద్రాబాద్ : సీతాఫల్ మండి కుట్టి వెళ్ళోడిలో పని చేస్తున్న ఆశా వర్కర్లకు కార్పొరేటర్ హేమ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ హాజరై ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు అండగా నిలిచిన కార్పొరేటర్ హేమను అభినందించారు. కరోనా సమయంలో కీలక పాత్ర పోషిస్తుంది ఆశా వర్కర్లే అని కొనియాడారు.

అనంతరం హేమ మాట్లాడుతూ.. ఆశా వర్కర్లకు సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. కరోనా సమయంలో వారు చేస్తున్న సేవలు మరువలేవని వారికి ఎంత చేసిన తక్కువే అవుతుందని తెలిపారు. వారికి, వారి కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed