ఉరి వేసుకుని కరోనా పేషెంట్ మృతి

by  |
ఉరి వేసుకుని కరోనా పేషెంట్ మృతి
X

దిశప్రతినిధి, ఆదిలాబాద్:
కరోనా బాధితుడు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్న ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముధోల్ మండలంలోని బోరిగాం గ్రామంలో కరోనా భయంతో ఆనందరావు( 45) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. నాలుగు రోజుల క్రితం కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆనందరావు మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చుట్టుపక్కలవారు అనుమానంగా చూడడం… కరోనా నయం అవుతుందో, లేదోనన్న భయం కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

Next Story