- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రేటర్ అభివృద్ధిపై కరోనా ఎఫెక్ట్
<p>దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. అయితే, గ్రేటర్లో రానున్నది ఎన్నికల కాలం. ఎనిమిది నెలల్లో గ్రేటర్ ఎలక్షన్స్లో గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నగరం నలుమూలలా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టారు. అయితే, కరోనా నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు ఇండ్లు కట్టించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం పథకాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఇటీవలే […]</p>

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావం అన్ని వ్యవస్థలపైనా పడుతోంది. అయితే, గ్రేటర్లో రానున్నది ఎన్నికల కాలం. ఎనిమిది నెలల్లో గ్రేటర్ ఎలక్షన్స్లో గెలిచేందుకు అధికార పార్టీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు నగరం నలుమూలలా పలు కీలక ప్రాజెక్టులు చేపట్టారు. అయితే, కరోనా నేపథ్యంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్లో పేదలకు ఇండ్లు కట్టించే ప్రతిష్టాత్మక ప్రాజెక్టు డబుల్ బెడ్ రూం పథకాన్ని వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని ఇటీవలే మంత్రులు ప్రకటించారు. తెల్లాపూర్లో తప్ప మిగిలిన చోట్లలో ఈ ఇండ్లు అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మూడు, నాలుగు చోట్ల ప్రారంభించి బల్దియా ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. సిటీలో 1,500 టాయిలెట్లను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామని బల్దియా పాలక యంత్రాంగం ప్రకటించింది. కానీ, ఇవేవీ ఇప్పట్లో ప్రారంభం కావడం లేదు. కరోనాతో అన్ని వాయిదా పడ్డాయి. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రథమ ప్రాధాన్యతలో ఉన్న ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణాలు సగానికిపైగానే పూర్తి చేయాల్సి ఉంది. రోడ్ల విస్తరణ పనులు, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణాల కోసం శంకుస్థాపన కార్యక్రమాలూ నిలిచిపోయాయి.
ఎన్నికల భయం..!
జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తాగునీటి సరఫరా, డ్రైనేజీల పునరుద్ధరణ పనులపైనా కరోనా ప్రభావం పడుతోంది. నగరంలో చేపట్టదలిచినా ఫుట్పాత్ల నిర్మాణాలు కూడా ఆగిపోతున్నాయి. అయితే, అధికార పార్టీ నాయకులకు కరోనాతో పాటు గ్రేటర్ ఎన్నికల భయం కూడా పట్టుకున్నట్టు తెలుస్తోంది. నాలాల విస్తరణకు ప్రభుత్వం రూ.200 కోట్లను మంజూరు చేసినా.. శంకుస్థాపనలను కరోనా అడ్డుకోవడంతో ఆ పనులు వాయిదా పడుతున్నాయి. పార్కుల, స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని బల్దియా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ, ఉన్నవాటికే తాళాలు వేసే పరిస్థితి వచ్చింది. బస్ షెల్టర్టు, జంక్షన్లు అభివృద్ధి తదితర కార్యక్రమాలన్నీ కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా పడ్డాయి.
Tags:GHMC elections, coronavirus, openings






