తెలంగాణలో 1,610కి చేరిన కరోనా మరణాలు

by  |
తెలంగాణలో 1,610కి చేరిన కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కొత్తగా 150కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,95,581కి చేరింది. ఇద్దరు చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 1,610గా ఉంది. అటు దేశవ్యాప్తంగా 12,059 కరోనా కేసులు నమోదు కాగా 78 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,08,26,363కి చేరింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనాతో 1,54,996 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 1,48,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాకు చికిత్స తీసుకొని 1,05,22,601 బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. 57,75,322మందికి వ్యాక్సినేషన్ జరిగినట్లు కేంద్రం తెలిపింది.



Next Story