అమానుషం.. సైకిల్ పైనే కరోనా శవం

by  |
అమానుషం.. సైకిల్ పైనే కరోనా శవం
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్‌ మానవ సంబంధాలను మంటగలిపితే.. ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా మరిన్ని అమానుష ఘటనలు వెలుగుచూస్తున్నాయి. కరోనాతో మృతి చెందిన వ్యక్తికి కనీసం ప్రత్యేకించి వాహనాలను కూడా ఏర్పాటు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబీకులు శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించిన హృదయవిదాకర ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.

వివరాళ్లోకి వెళితే.. కర్ణాటకలోని బెల్గాం జిల్లా కిత్తూరులో ఓ 70 ఏళ్ల వృద్ధుడు కరోనా సోకి మరణించాడు. అయితే, ఆ శవాన్ని తరలించేందుకు అంబులెన్సు రాలేదు. దిక్కు తోచని పరిస్థితుల్లో పీపీఈ కిట్ ధరించుకున్న కుటుంబీకులు వృద్ధుడి శవాన్ని సైకిల్‌పై తీసుకెళ్లారు. ఈ అమానుష ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోను ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ లీడర్ డీకే శివ కుమార్ తన ట్విట్టర్‌లో సోమవారం షేర్ చేశారు.
ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. ‘బెల్గాం కిత్తూర్‌కు చెందిన 70 ఏళ్ల శవాన్ని కుటుంబ సభ్యులు సైకిల్‌లో తరలించారు.. మీ ప్రభుత్వం ఎక్కడ ఉంది? వారు ఎందుకు అంబులెన్స్ ఇవ్వలేదు?.. ఈ అసమర్థ ప్రభుత్వానికి మానవత్వం లేదు.. బెదిరింపును పూర్తిగా భరించలేకపోతోంది’ అంటూ యడియూరప్ప ప్రభుత్వాన్ని నిలదీస్తూ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed