కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత

by  |
కరోనాతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత
X

దిశ, వెబ్ డెస్క్ : కరోనాతో పోరాడుతూ తమిళనాడు కన్యాకుమారికి చెందిన కాంగ్రెస్ ఎంపి హెచ్ వసంతకుమార్ మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. 70 ఏళ్ల వసంతకుమార్ కరోనా బారిన పడి ఆగస్టు 10 న చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు.

న్యుమోనియా వ్యాధి ఉన్న కారణంగా ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ సపోర్ట్‌లోనే ఉంచారు వైద్యులు. ఆయన వయసు ప్రభావం, న్యుమోనియా వలన కరోనా నుండి కోలుకోలేకపోయారని వైద్యులు వెల్లడించారు.

కాగా తమిళనాడు నుండి ఎంపిగా, ఎమ్మెల్యేగా పలుసార్లు రాష్ట్ర ప్రజలకు సేవలందించారు వసంత కుమార్. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తించారు.



Next Story