‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వార్నింగ్

by  |
‘దమ్ముంటే రాజీనామా చేయ్’.. ఎమ్మెల్యే రేగా కాంతారావుకు వార్నింగ్
X

దిశ, మణుగూరు: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.. టీపీసీసీ రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే సహించేది లేదని ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీతో గెలిచి.. అభివృద్ధి సాకుతో టీఆర్ఎస్ కండువా కుప్పుకున్నారని.. అయినా దళితులు, గిరిజనులు, మైనార్టీలకు ఎమ్మెల్యే చేసిందేమీ లేదని విమర్శించారు. రేగా కాంతారావుకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. దళితుల కోసం ఆత్మగౌరవ సభ పెట్టి రేవంత్ రెడ్డి పోరాడుతుంటే.. టీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కేవలం కేసీఆర్ మెప్పు కోసమే రేవంత్‌ రెడ్డిని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. టీపీసీసీని విమర్శించే ముందు.. రేగా కాంతారావు తన పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ జెండా‌పై గెలవాలని కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మణుగూరు పట్టణ అధ్యక్షుడు పిరానాకి నవీన్, పినపాక నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ బీరం సుధాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎండీ రషీద్ తదితరులు పాల్గొన్నారు.

Next Story