- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మహబూబ్ నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తూ దోబూచులాడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ విమర్శించారు. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి రెండుసార్లు ప్రభుత్వాలు ఏర్పాటు చేశారని అన్నారు. రైతులకు చేదోడువాదోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలే ధర్నాలకు దిగడం హాస్యాస్పదంగా వుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తే రాత్రికి రాత్రే అరెస్టులు చేసి గృహానిర్బంధం చేస్తారని దుయ్యబట్టారు. దేశంలో రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని.. వారి తరపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడుతామన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. టీఆర్ఎస్ నుంచి ఏ మంత్రి కూడా ఢిల్లీకి వెళ్లి రైతులకు మద్దతుగా ఏ పని చేయడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఒబెదుల్లా కొత్వాల్, ఎన్పీ వెంకటేశ్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్, బెనహర్ తదితరులు పాల్గొన్నారు.