న్యాయసలహా అడిగితే నో చెప్పా : అభిషేక్ సింఘ్వీ

by  |
న్యాయసలహా అడిగితే నో చెప్పా : అభిషేక్ సింఘ్వీ
X

దిశ, వెబ్‌డెస్క్ : రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి, తిరుగుబాటు నేత సచిన్ పైలట్ తనను న్యాయ సలహా అడిగారని.. అందుకు తాను నిరాకరించానని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మనూ సింఘ్వీ అన్నారు. ఇప్పటికీ తామిద్దరమూ మంచి స్నేహితులమే అని, అయితే న్యాయ సలహా ఇవ్వడానికి మాత్రం నిరాకరించానని చెప్పుకొచ్చారు.

ఎందుకంటే.. ఈ విషయంలో తాను స్పీకర్ జోషి వైపు ప్రాతినిధ్యం వహిస్తున్నందుకే ఆ పని చేశానని స్పష్టంచేశారు. సచిన్ పైలట్ చాలా తెలివైనవాడు. అతని ప్రతిభను మెచ్చుకునే నేతలు చాలా మందే ఉన్నారు. అయితే.. రాజస్థాన్ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకోవడం చాలా బాధాకరమని సింఘ్వీ అభిప్రాయం వ్యక్తంచేశారు.


Next Story

Most Viewed