తగిన చర్యలు కూడా ఉంటాయి: వైమానిక దళాధిపతి

by  |
తగిన చర్యలు కూడా ఉంటాయి: వైమానిక దళాధిపతి
X

దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్ కేఎస్ భదౌరియా అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన ఆయన.. వైమానిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు బృందానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, తదుపరి ఎలాంటి చర్యలకైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు కూడా ఉంటాయన్నారు. సహరిద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, బలగాలను మోహరించామని చెప్పారు.

Next Story

Most Viewed