- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల త్యాగాలను వృథా కానివ్వమని వైమానిక దళాధిపతి ఆర్ కేఎస్ భదౌరియా అన్నారు. దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్ కు హాజరైన ఆయన.. వైమానిక దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు బృందానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, తదుపరి ఎలాంటి చర్యలకైనా త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులు సంభవించినా ఎదుర్కొనే సత్తా మనకు ఉందన్నారు. సరైన సమయంలో తగిన చర్యలు కూడా ఉంటాయన్నారు. సహరిద్దుల్లో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, బలగాలను మోహరించామని చెప్పారు.
Next Story