ఆ ఇంటికెళ్లిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్

by  |
ఆ ఇంటికెళ్లిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్‌లో టెన్షన్.. టెన్షన్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్ నందినగర్‎లోని తన స్వంత ఇంటికి వెళ్ళారు. ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్‌లోనే ఉంటున్న కేసీఆర్ హఠాత్తుగా సొంత ఇంటికి వెళ్ళడం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లోనే సంచలనం రేకెత్తించింది. ఇంత ఆకస్మికంగా ఆ ఇంటికి వెళ్ళడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ ఇంట్లో గత కొంతకాలంగా మరమ్మత్తు పనులు జరుగుతున్నాయని, వాటిని పరిశీలించడానికే వెళ్ళినట్లు ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. కానీ అనూహ్యంగా మధ్యాహ్నం 3.20 గంటలకు వెళ్ళడం ఉత్కంఠ రేకెత్తించింది.

టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆ ఇంటి నుంచే రాజకీయ వ్యవహారాలను నడిపిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ లేదా ప్రగతి భవన్ నుంచే తన రోజువారీ వ్యవహారాలను నడిపారు. నందినగర్ ఇంటికి పెద్దగా వెళ్ళింది లేదు. కానీ ఇప్పుడు మరమ్మత్తు పనులకు ఉత్తర్వులివ్వడం, అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించడానికి వెళ్ళడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



Next Story

Most Viewed