సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఎందుకంటే ?

by  |
సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్.. ఎందుకంటే ?
X

దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ మళ్లీ ఢిల్లీ వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. అయితే, ఈ నెల 26న వివిధ రాష్ట్రాల సీఎంలతో హోం మంత్రి అమిత్ షా సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పాల్గొననున్నారు. రేపు జరనున్న అసెంబ్లీ సమావేశం మొదటి సెషన్‌లో పాల్గొని అనంతరం టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొని సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ సమావేశంలో.. నక్సలైట్ల సమస్యను ఎదుర్కోవడానికి అన్ని రాష్ట్రాల సమన్వయంతో కేంద్ర హోంశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుండగా.. దానిని మరింత వేగవంతం చేసి హింసను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు హోంశాఖ కార్యదర్శి, డీజీపీ వెల్లనున్నారు.



Next Story

Most Viewed